Sunday, November 9, 2008

కొత్త బంగారు లోకం 'పాడు' బడింది


కోత బంగారు లోకం యువతను ఆకట్టుకొని ,ఆలోచనలనూ తప్పుపట్టే చిత్రంగా నిలిచింది.సినిమా ఆద్యంతం చాలాబాగున్నా ,చివరి 2 నిముషాలు ,సినిమా మీద వెగటు అసహ్యం పుట్టిస్తయ్యి .కథకి ముగింపు ఎలా చెయ్యాలో తెలియక , తల్లిదండ్రులూ మరియు పిల్లలు బాధ్యత లేని వారిగా చూపించారు .ముఖ్యంగా ఆడపిల్లకు ,వాళ తల్లిదండ్రులకు పరస్పరం బాధ్యతా ,గౌరవం లేని వారిగా కనుబడుతారు .

ఛాయాగ్రహణం ,ఎడిటింగ్ ,సంగీతం,సాహిత్యం ,కెమెరా పనితనం వంటివి సాంకేతిక పరంగా చాలా బాగున్నాయి.హీరో నటన బాగున్నా ,హీరోయిన్ ఈ సినిమా కి నిజమైన హీరో , మూలబలం ,నటన లో పరిణతి కనబరిచినా వయసు తక్కవగా కనిపించి ,పాత్రకి సరిగ్గా సరిపోయింది .ఆహుతి ప్రసాద్ ,జయసుధ కోతగా కనిపించినాప్రకాష్ రాజ్,బ్రహ్మానందం మామూలే ,కాకాపోతే కొత్తగా చాల మంది కనిపించి కనువిందు చేస్తారు ,హాస్టల్ లో స్టూడెంట్స్ ,మరియు హీరో ఫ్రెండ్స్ తెరమీద కొత్తదనం,చిలిపి ,కొంటెతనం కలబోసి రంగుల తో కనువిందు చేసుతూ విన్నుల విందుని వడ్డిస్తారు.
ఫ్యామిలీ సినిమా కాకపోయనా ,యువతకు తప్పుడు ఆలోచనలు కల్పించ వచ్చు .

No comments: